కుమార్తెను కమలే చంపేశాడు
వికారబాద్ : రంగారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన కేసులో ఆమె కన్నతండ్రి కమలే నిందితుడని రంగారెడ్డి జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఆదివారం వికారాబాద్లో విలేకర్ల సమావేశంలో ఎస్పీ ఆ హత్య కేసు వివరాలను వెల్లడించారు. ఈ కేసులో నిందితుడు కమల్ పోలీసులను తప్పు దోవ పట్టించేందుకు యత్నించాడని చెప్పారు. విచారణలో భాగంగా అతడు భిన్న కథనాలు వెల్లడించాడని తెలిపారు.
ఆ కథనాలు ఆధారంగా నిందితుడు కమల్ అని గుర్తించామన్నారు. అలాగే మెగావత్ కమల్ కదలికలతోపాటు కాల్ డేటానూ నిశితంగా పరిశీలించామని పేర్కొన్నారు. దాంతో అతడు అబద్ధాలు చెప్పినట్లు నిర్థారణకు వచ్చామని ఎస్పీ తెలిపారు. కుమార్తె హత్య చేసిన నాటి నుంచి జరిగిన పరిణామాలు అన్ని పరిశీలించామన్నారు.
కుమార్తె హత్య చేశారని చెప్పినప్పుడు ఆమె తల్లి మరో ముగ్గురు పోలీసు స్టేషన్కు వచ్చారని ఆ తర్వాతే కమల్ పోలీసు స్టేషన్కు వచ్చాడని ... అయితే కుమార్తె సిమ్రాన్ను నీవే హత్య చేశావు కదా అని భర్త కమల్ను భార్య పలుమార్లు ప్రశ్నించిందని... తనకే పాపం తెలియదని అతడు బుకాయించాడని ఎస్పీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
రంగారెడ్డి జిల్లా మోమిన్పేట మండలం ఇజ్రాచిట్టెంపల్లి తండాకు చెందిన సిమ్రాన్(14) 8వ తరగతి చదువుతుంది. ఇటీవలే పరీక్షలు రాసి హైదరాబాద్ చందానగర్లోని బంధువుల ఇంటికి వెళ్లింది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో సొంతూరుకు తండ్రి కమాల్తో కలసి బయలుదేరింది. ఆ క్రమంలో తనపై దాడి చేసి సిమ్రాన్పై ఐదుగురు వ్యక్తులు అత్యాచారం చేసి ఆపై ఆమెను హత్య చేశారని తండ్రి మెగావత్ కమల్ కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అత్యాచారం, హత్య కన్న తండ్రే చంపాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.
సంబంధిత వార్తలు