వైద్య విద్యార్థిని ఆత్మహత్య

వైద్య విద్యార్థిని ఆత్మహత్య - Sakshi

మత్తు ఇంజక్షన్‌ ఇచ్చుకుని బలవన్మరణం 

 

ముథోల్‌: నిర్మల్‌ జిల్లా ముథోల్‌ మండల కేంద్రానికి చెందిన వైద్య విద్యార్థిని దప్కల్‌ సవిత(26) మంగళవారం మత్తు ఇంజక్షన్‌ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ముథోల్‌ ముథోల్‌ మండల కేంద్రంలోని మహాలక్ష్మి గల్లీకి చెందిన సవిత హైదరాబాద్‌లోని ఉస్మానియా వైద్య కళాశాలలో అనస్తీషియా విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువు తోంది. ఇటీవల వరుస సెలవులు రావడంతో మూడు రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చిం ది. గదిలో విశ్రాంతి తీసుకుంటున్న సవితను కుటుంబ సభ్యులు పలకరించడానికి వెళ్లగా.. అప్పటికి అపస్మారక స్థితిలో ఉంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెం దినట్టు వైద్యులు తెలిపారు.



అయితే ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియ రాలేదు. కాగా, సవితకు ఇటీవల వివాహం నిశ్చ యమైంది. ఇంతలో ఆత్మహత్యకు పాల్పడ డంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. మృతిరాలి తండ్రి గంగాధర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. మహాలక్ష్మి గల్లీకి చెందిన లక్ష్మిృగంగాధర్‌లకు ఏడుగురు సంతానం. ఏడో సంతానమైన సవితను డాక్టర్‌ చేయాలనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులందరూ కలసి చదివిస్తున్నారు. ఉదయం వరకు అందరితో కలుపుగోలుపుగా మాట్లాడుతూ గడిపిన సవిత ఆత్మహత్యకు పాల్పడడం అంతుపట్టడం లేదంటూ కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top