వైద్య విద్యార్థి ఆత్మహత్య


నార్కట్‌పల్లి (నల్లగొండ) : పీజీ వైద్య విద్యార్థి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి కామినేని మెడికల్ కళాశాలలో పీజీ ప్రథమ సంవత్సరం చదువుతున్న రఘురాం అనే విద్యార్థి స్థానికంగా ఓ అద్దెగదిలో ఉంటున్నాడు. కాగా హైదరాబాద్‌ వనస్థలిపురంలో నివాసముండే తన తల్లిదండ్రులకు ఆదివారం తెల్లవారుజామున ఫోన్‌చేసి తాను చనిపోతున్నట్టు చెప్పాడు. రఘురాం తల్లిదండ్రులు వెంటనే నార్కట్‌పల్లి పోలీసులకు ఫోన్ చేసి విషయాన్ని తెలియజేశారు. దాంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా అప్పటికే రఘురాం తన గదిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు.



రఘురాం మత్తు మందు ఇంజెక్షన్ చేసుకుని, ముఖానికి కవర్ గట్టిగా చుట్టుకుని ప్రాణం తీసుకున్నాడు.ఆత్మహత్య చేసుకోబోయే ముందు రఘురాం తన ల్యాప్‌ట్యాప్‌లో సూసైడ్ నోట్ రాసినట్టు గుర్తించారు.  ప్రేమ వ్యవహారమే అతని ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. రఘురాం తాను చదువుతున్న కళాశాలలోనే ఓ విద్యార్థినిని ప్రేమిస్తున్నట్టు సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top