మూడుగా మెదక్ జిల్లా విభజన: కేసీఆర్
ప్రస్తుత మెదక్ జిల్లాను మూడు జిల్లాలుగా విభజిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు చెప్పారు. మెదక్ జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన బుధవారం నాడు మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వ భూమలను అమ్మి 25 వేల కోట్ల రూపాయలు సమకూరుస్తామన్నారు. తెలంగాణవ్యాప్తంగా ఏడాది కాలంలో మొత్తం 250 కోట్ల మొక్కలను నాటుతామని ఆయన తెలిపారు. ఐదేళ్లలో ఇంటింటికీ మంచనీరు ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలను అసలు ఓట్లు అడిగేది లేదని చెప్పారు.