లాసెట్ దరఖాస్తుకు మే 7వరకు గడువు


ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర పరిధిలోని న్యాయ కళాశాలల్లో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల ప్రవేశ పరీక్షకు అపరాధ రుసుంతో మే నెల 7వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఖమ్మంలోని మానేర్ న్యాయ కళాశాల శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. రూ.500ల అపరాధ రుసుంతో ఏప్రిల్ 30వ తేదీ వరకు, రూ.1,000 అపరాధ రుసుంతో మే 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ప్రవేశ పరీక్ష మే 19న ఉంటుందనీ, వరంగల్, హైదరాబాద్, ఖమ్మం, నల్లగొండ కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందని తెలిపింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top