కుటుంబం ఆత్మహత్యాయత్నం, తల్లి మృతి


కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో ఓ కుటుంబం ఆత్మాహత్యాయత్నానికి పాల్పడింది. గోదావరి ఖని మండలం జనగామ పోతన కాలనీలో ఇద్దరు కుమారులు సహా ఓ తల్లి పురుగుల మందు తాగింది. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా, ఇద్దరు కుమారుల పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా కుటుంబ కలహాల కారణంగానే గృహిణి ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.





 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top