గతంలోనూ ప్రమాదాలు..పట్టించుకోని అధికారులు

గతంలోనూ ప్రమాదాలు..పట్టించుకోని అధికారులు - Sakshi

మెదక్: మసాయిపేట రైల్వే గేట్ వద్ద గతంలో కూడా ప్రమాదాలు చోటుచేసుకున్నాయని స్థానికులు వెల్లడించారు. గత ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద కాపాలాదారుడు లేకపోవడం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సైరన్ లేకుండా రైలు రావడం, బస్సు డ్రైవర్ గమనించకపోవడంతో ఈ ఘోర ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. 

 

ఇస్లాంపూర్ నుంచి తుఫ్రాన్ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే గేటు నుంచి కిలో మీటర్ వరకు బస్సు ఈడ్చుకు వెళ్లినట్టు తెలుస్తోంది. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top