వివాహిత ఆత్మహత్య
ఆర్థిక లావాదేవిల విషయంలో జరిగిన వాగ్వాదం.. ఓ వివాహిత మహిళ ఆత్మహత్యకు దారితీసింది. వరంగల్ జిల్లా ఏటూరు నాగారంలో సోమవారం ఉదయం ఓ వివాహిత వంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. స్థానికంగా నివాసముంటున్న హేమవతి(33) దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఈక్రమంలో వ్యవసాయ పనిముట్లకు సంబంధించిన డబ్బుల విషయంలో గ్రామస్థులతో వాగ్వాదం జరగడంతో మనస్తాపానికి గురైన హేమవతి ఇంట్లో ఎవరు లేని సమయంలో వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.