వివాహిత ఆత్మహత్య
మిర్యాలగూడ : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో మంగళవారం సాయంత్రం ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పట్టణంలోని హౌసింగ్బోర్డ్ కాలనీలో నివాసం ఉండే నాగమణి(24) మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్కు ఉరేసుకుంది. భర్త రాములు సుతారీ మేస్త్రీగా పనిచేస్తుండగా... సాయంత్రం ఇంటికి వచ్చి చూసే సరికి భార్య ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాములు, నాగమణికి ఏడాది క్రితం వివాహం కాగా, వారి మధ్య మనస్పర్థలు ఉన్నట్టు తెలిసింది.