విద్యుదాఘాతంతో వివాహిత మృతి


దామరచర్ల: విద్యుదాఘాతంతో ఓ వివాహిత మృతిచెందింది. ఈ ఘటన దామరచర్ల మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మటంపల్లి మండ లం రఘునాథపాలెం గ్రామానికి చెం దిన జరీనా(జైనాబీ)(25)కు, దామరచర్లకు చెందిన బషీర్‌తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వేసవికాలం కావడంతో దంపతులు శుక్రవారం రాత్రి ఇంటిస్లాబ్‌పై నిద్రించారు. వేకువజామున బషీర్ నిద్రలేచి నేమాజ్‌కు వెళ్లగా, జరీనా ఇంటి పనులకు ఉపక్రమించింది. కాసేపటికి మేడపై ఉన్న దుప్పట్లు తీసుకువచ్చేందుకు మేడపైకి వెళుతోంది.

 

  ఈ క్రమంలో ఇంటికి విద్యుత్ సరఫరా అయ్యే సర్వీస్‌వైరు మధ్యలో జాయింట్ ఊడి ఉంది. దానిని జరీనా గమనించకపోవడంతో ఆమె చెయ్యి సర్వీస్ వైరుకు తగిలి విద్యుదాఘాతానికి గురై మేడపై నుంచి కింద పడి అక్కడికక్కడే మృతిచెందింది. నమాజ్ ముగించుకుని తిరిగి ఇంటికి వచ్చిన బషీర్ సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. తహసీల్దార్ రమాదేవి పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి జమాల్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ .జానయ్య తెలిపారు.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top