మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వే లైను పొడిగింపు
-
సీఎం కేసీఆర్కు సీఎల్పీ ఉపనేత జీవన్రెడ్డి లేఖ
సాక్షి, హైదరాబాద్ : మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వే లైనును జగిత్యాల నుంచి మంచిర్యాల వరకు పొడిగించాలని సీఎల్పీ ఉపనేత, జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్రెడ్డి సీఎం కె.చంద్రశేఖర్రావును కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సీంఎకు ఓ లేఖ రాశారు. లైన్ పొడిగింపు వల్ల తెలంగాణ రాష్ర్ట్రంలో మంచిర్యాల ప్రధాన కూడలి కావడమే కాకుండా, ఉత్తర భారతానికి లింకు ఏర్పడుతుందని పేర్కొన్నారు.
ప్రతిపాదిత మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైను సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల పట్టణాలను కలుపుతోందని, దీన్ని జగిత్యాల నుంచి ధర్మపురి, లక్సెట్టిపేట మీదుగా మంచిర్యాలకు కలపాలని కోరారు. ప్రత్యామ్నాయ లైను వేయడం వల్ల కనీసం 14 మండలాలకు రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని లేఖలో వివరించారు.