మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వే లైను పొడిగింపు


  • సీఎం కేసీఆర్‌కు సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి లేఖ

  • సాక్షి, హైదరాబాద్ : మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వే లైనును  జగిత్యాల నుంచి మంచిర్యాల వరకు పొడిగించాలని సీఎల్పీ ఉపనేత, జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి సీఎం కె.చంద్రశేఖర్‌రావును కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సీంఎకు  ఓ లేఖ రాశారు. లైన్ పొడిగింపు వల్ల తెలంగాణ రాష్ర్ట్రంలో మంచిర్యాల ప్రధాన కూడలి కావడమే కాకుండా, ఉత్తర భారతానికి లింకు ఏర్పడుతుందని పేర్కొన్నారు.



    ప్రతిపాదిత మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైను సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల పట్టణాలను కలుపుతోందని, దీన్ని జగిత్యాల నుంచి ధర్మపురి, లక్సెట్టిపేట మీదుగా మంచిర్యాలకు కలపాలని కోరారు. ప్రత్యామ్నాయ లైను వేయడం వల్ల కనీసం 14 మండలాలకు రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని లేఖలో వివరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top