'అవినీతి ఆరోపణలు వస్తున్న మంత్రులపై చర్యలేవి?'
నిజామాబాద్: అవినీతి ఆరోపణలు వస్తున్న మంత్రులపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు. ప్రజలే బాసులు అన్న కేసీఆర్ మాటలు అబద్దాలన్నారు.
దళితుల భూ పంపిణీ విషయంలో కాలపరిమితి ఎందుకు విధించలేదని మంద కృష్ణ ప్రశ్నించారు.