'ఆయనేంటో ఇప్పటికైనా తెలుసుకోవాలి'
మహబూబ్నగర్: వరవరరావు అరెస్టెను ఎమ్మార్పీఎస్ నాయకుడు మంద కృష్ణమాదిగ ఖండించారు. ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ పక్షాలు ఇప్పటికైనా కేసీఆర్ ఏంటో తెలుసుకోవాలని ఆయన కోరారు. దళితులతో పాటు అన్ని వర్గాలను మోసం చేయడమే కేసీఆర్ నైజమని మందకృష్ణ దుయ్యబట్టారు.
ఎమ్మార్పీఎస్ అంటే కేసీఆర్ కు భయమని అందుకే దీన్ని చీల్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మార్పీఎస్ లోని కొంత మంది నాయకులను చేరదీసి, డబ్బులు ఇచ్చి మాదిగ ఐక్యతను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.