వ్యక్తి అనుమానాస్పద మృతి


మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లాలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మానవపాడు మండలం జల్లాపూర్ గ్రామానికి చెందిన కుర్వ మహేష్(44) శనివారం రాత్రి ఇంటి సమీపంలో అనుమానాస్పదంగా మరణించాడు.


ఇది గుర్తించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పేకాట ఆడుతున్న క్రమంలో జరిగిన వివాదం వల్లే మహేష్‌ను అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు హతమార్చి ఉంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

 

Election 2024

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top