ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
జవహర్నగర్ : అనారోగ్యానికి గురైన మతి స్థిమితం కోల్పోయిన ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ శంకర్నాయక్ కథనం మేరకు.. నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండలం లక్ష్మాపూర్కు చెందిన కొత్త నర్సింహారెడ్డి (34), అనిత దంపతులు బతుకుదెరువు నిమిత్తం కొన్నేళ్ల క్రితం కాప్రా సర్కిల్ ఎల్లారెడ్డిగూడకు వలస వచ్చారు. ఇక్కడ కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవారు.
కాగా.. కొన్ని నెలలుగా నర్సింహారెడ్డి అనారోగ్యం బారినపడి మతిస్థిమితం కోల్పోయాడు. ఇటీవల కాలంలో తాను చనిపోతానని తరచూ ఇంటి నుంచి వెళ్లడం.. కుటుంబ సభ్యులు సర్ది చెప్పడం జరుగుతోంది. శనివారం అర్ధరాత్రి సమయంలో ఇంటినుంచి బయటకు వెళ్లిన నర్సింహారెడ్డి.. ఎల్లారెడ్డి సమీపంలోని పొదల్లో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు ఆదివారం ఉదయం మతదేహాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మతుడు నర్సింహారెడ్డిగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.