కరీంనగర్ లో వ్యక్తి ఆత్మహత్య


కరీంనగర్: కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం తిప్పాపూర్ శివారులోని ఓ రియల్‌ వెంచర్‌లో మంగళవారం రాత్రి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంచర్‌లో ఉన్న ఓ చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. బుధవారం ఉదయం చెట్టుకు వేలాడుతూ ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చనిపోయిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనేది పోలీసు విచారణలో తేలాల్సి ఉంది.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top