పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య


ఆదిలాబాద్(దండేపల్లి): ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం నెల్కివెంకటాపూర్ గ్రామంలో పురుగుల మందు తాగి పిట్టల మల్లేష్(35) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబకలహాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి పొలంలో పురుగుల మందు తాగి అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం ఆయన మృతదేహాన్ని స్థానికులు చూసి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top