పీఎస్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం


మహబూబ్ నగర్(కొత్తూరు): ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి పోలీస్‌స్టేషన్‌లో ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరులో మంగళవారం చోటుచేసుకుంది. ఓ మహిళ మెడలో గొలుసు అపహరించిన కేసులో మండలంలోని చెగూర్ పంచాయతీ పరిధిలోని తాళ్లగూడకు చెందిన శివను పోలీసులు అనుమానితుడిగా భావించి అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే శివ మంగళవారం ఉదయం పోలీస్‌స్టేషన్‌లో ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, నిందితుడిన శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top