సజ్జాపురంలో వ్యక్తి దారుణ హత్య
నేరేడుచర్ల(నల్లగొండ): ఒక వ్యక్తి ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో గుర్తు తెలియని దుండగులు దాడి చేసి హతమార్చారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నేరేడుచర్ల మండలం సజ్జాపురం గ్రామంలో శనివారం రాత్రి 11గంటలకు జరిగింది. వివరాలు.. సజ్జాపురానికి చెందిన చిట్టెపు సైదిరెడ్డి(45) స్నేహితులను కలిసి ఇంటికి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి రాళ్లతో తలపై బాదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం స్థానికి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సైదిరెడ్డి 2009 జరిగిన ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. దీంతో సైదిరెడ్డి హత్యకు పాతకక్ష్యలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.