వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో దారుణం


వరంగల్‌ అర్బన్‌: వరంగల్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యతో పాటు కన్నబిడ్డలపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. ఈ సంఘటన జిల్లాలోని తిమ్మాపురంలో సోమవారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య భవానితో పాటు కూతుళ్లు వర్షిణి, అమృతల పై కిరోసిన్‌ పోసి నిప్పటించాడు. ఈ ఘటనలో భార్య భవాని, కూతురు వర్షిణి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో కూతురు అమృతకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.  
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top