బావిలో పడి వ్యక్తి మృతి
ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గిర్జం గ్రామంలో ప్రమాదవశాత్తూ బావిలోపడి పెద్దశేఖర్ (31) అనే వ్యక్తి మృతిచెందాడు. శేఖర్ బావి పక్కన నిల్చున్న సమయంలో కాలుజారి అకస్మాత్తుగా బావిలో పడినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఎత్తు నుంచి పడటం, శేఖర్కు ఈత రాకపోవడం వల్ల కాసేపటికే మునిగి చనిపోయాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.