విద్యుత్ షాక్తో యువకుడి మృతి


కౌతాల: వినోదం కోసం టెలివిజన్ ఆన్ చేస్తుండగా ఓ యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా కౌతాల మండలం మొగడదగడ్ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. జెల్లపల్లి శంకర్ (26) భోజనం చేసే ముందు టీవీ ఆన్ చేయబోగా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top