విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి


ధర్మపురి(కరీంనగర్ జిల్లా): ధర్మపురి మండలకేంద్రంలోని తెనుగువాడ ముదిరాజ్ కాలనీలో సోమవారం కరెంటు షాక్‌తో జింక తిరుపతి(35) అనే వ్యక్తి మృతిచెందాడు. కాలనీలోని ఓ స్తంభంపైకి ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి స్తంభం పైనుంచి కిందకు పడి అక్కడికక్కడే మృతిచెందాడు. తిరుపతి స్వస్థలం గోదావరిఖని.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top