లారీ ఢీకొని వృద్ధుడి మృతి
పెద్దశంకరం పేట : వేగంగా వెళ్తున్న లారీ ఓ వ్యక్తిని బలి తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే... శుక్రవారం మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రానికి సమీపంలోని ఓ దాబా వద్ద నిజాముద్దీన్(70) అనే వ్యక్తిని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో అతను అక్కడిక్కడే మృతిచెందాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడు గొట్టిముక్కల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.