బైక్‌పై నుంచి పడి యువకుడి మృతి


అరవపల్లి: ప్రమాదవశాత్తూ బైక్‌పై నుంచి పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా అరవపల్లి మండలం అడివేముల గ్రామ శివారులో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. అడివేముల గ్రామానికి చెందిన నోముల లింగమయ్య(30) అనే యువకుడు సూర్యాపేటకు బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top