శుభకార్యానికి పిలవడానికి వెళ్తే..
వేములవాడ: తన ఇంట్లో జరుగుతున్న శుభకార్యానికి ఆహ్వానించడానికి బావ ఇంటికి వెళ్లిన ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా సిద్దిపేటలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా వేములవాడ భగత్నగర్కు చెందిన మాజీ వార్డు సభ్యుడు మామిళ్ల మహేష్(42) తన ఇంట్లో జరుగుతున్న శుభకార్యానికి సిద్దిపేటలో ఉండే బావను పిలవడానికి వెళ్లాడు.
అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో.. కోపోద్రిక్తుడైన మహేష్ బావ అతన్ని గొంతు నులిమాడు. దీంతో మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు.
సంబంధిత వార్తలు