మురికి కాల్వలో పడి వ్యక్తి మృతి
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండలం ఓల గ్రామంలో సోమవారం రాత్రి ప్రమాదవశాత్తూ మురికి కాల్వలో పడి గంగారాం(42) అనే వ్యక్తి మరణించాడు. గ్రామ పంచాయతీ సమీపంలోని మురికి కాల్వలో గంగారాం పడి ఉండటం మంగళవారం ఉదయం గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారమందించారు. గంగారాం మూర్ఛ వ్యాధితో భాదపడుతున్నాడని, మురికి కాల్వలో పడి ఉండి మరణించి ఉండవచ్చునని కుటుంబసభ్యులు భావిస్తున్నారు