ఆర్టీసీ బస్సులో యువకుడి హఠాన్మరణం


అర్వపల్లి: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ఓ యువకుడు హఠాన్మరణం చెందాడు. నల్లగొండ జిల్లా అర్వపల్లి మండలం డి.కొత్తపల్లికి చెందిన శివరాత్రి రమేష్ శుక్రవారం ఉదయం జనగామ నుంచి స్వగ్రామం వెళుతుండగా నాగారం బంగ్లా గ్రామం సమీపంలో ఈ ఘటన జరిగింది. ఫిట్స్ వల్లే రమేశ్ మృతి చెందాడని తోటి ప్రయాణికులు అంటున్నారు. కాగా, రమేశ్ మూడు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నాడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top