చేతబడి నెపంతో వ్యక్తి హత్య


మేడిపెల్లి (కరీంనగర్) : మంత్రాల నెపంతో ఓ వృద్ధుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన కరీంనగర్ జిల్లా మేడిపల్లి మండలం కాచారం గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన నర్సయ్య(65) చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో అదే గ్రామానికి చెందిన నరేష్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసి హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top