మొక్కజొన్న తోటలో మృతదేహం
జగిత్యాల (కరీంనగర్) : గుర్తుతెలియని దుండగులు ఓ యువకుడిని కిరాతకంగా హతమార్చి మొక్కజొన్న తోటలో పడేశారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం బాలపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గాలిపల్లి రవి(32) అనే యువకుడిని గుర్తుతెలియని దుండగుటు కత్తులతో దారుణంగా చంపి గ్రామ శివారులోని తోటలో పడేశారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.