చేతబడి అనుమానంతో వ్యక్తికి దేహశుద్ధి


నల్లగొండ : చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఒక వ్యక్తిని ఆ గ్రామస్తులు చితకబాదారు. ఈ సంఘటన మంగళవారం నల్లగొండ జిల్లా కనగల్ మండలం కురంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటయ్య(35) అనే వ్యక్తి చేతబడి చేస్తున్నాడని గ్రామస్తులు గత కొంత కాలంగా అనుమాస్తున్నారు. ఆ క్రమంలో అతనిపై గ్రామస్తులు ముకుమ్మడిగా దాడి చేశారు.


ఈ దాడిని వెంకటయ్య సోదరుడు పెద వెంకటయ్యతోపాటు అతడి బావమరిది చంద్రయ్య అడ్డుకున్నారు. ఈ దాడిలో వారిద్దరు కూడా గాయపడ్డారు. అయితే వెంకటయ్య తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అతడి కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం నల్గొండలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top