దళితుల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారు
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: దళితులను మోసం చేసి సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. దళితులను ఓటుబ్యాంకుగా ఉపయోగించుకున్నారే తప్పించి ఇచ్చిన హామీలను మాత్రం నె రవేర్చలేదని విమర్శించారు. శుక్రవారం గాంధీభవన్లో టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ర్ట కార్యవర్గ సమావేశంలో ఏఐసీసీ ఎస్సీ విభాగం కార్యదర్శి డి. ప్రసాద్, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి, వర్కి ంగ్ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు.
ఈ భేటీ అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ వల్లే తెలంగాణ వచ్చిందని టీఆర్ఎస్ ప్లీనరీ గొప్పలు చెప్పుకుందని ఎద్దేవా చేశారు. ఇటు అసె ంబ్లీలో తెలంగాణ తీర్మానం చేయించి, అటు పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందేం దుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కృషి చేశారన్నారు. సోనియాగాంధీ దీక్షాదక్షతల వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. కేసీఆర్ కల్లబొల్లి మాటలు మానుకోవాలన్నారు.