చేర్యాల బ్యాంకులో భారీ అగ్నిప్రమాదం


వరంగల్ జిల్లా చేర్యాల ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకులో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మంటలు ఎగిశాయి. అయితే అటువైపు వెళ్తున్న పోలీసు గస్తీ వాహనం గమనించి వెంటనే అగ్నిమాపక విభాగాన్ని అప్రమత్తం చేయడంతో భారీ ప్రమాదం తప్పినట్లయింది.



కానీ అప్పటికే మంటలు తీవ్రంగా వ్యాపించాయి. బ్యాంకులో ఉన్న కంప్యూటర్లు, పేపర్లు పూర్తిగా దహనమయ్యాయి. నష్టం దాదాపు 5 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే.. ఒకవేళ పోలీసులు పట్టించుకోకపోతే మాత్రం లాకర్లలో ఉన్న నగలు, నగదు, ముఖ్యమైన పత్రాలు కూడా కాలిపోయేవని చెబుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top