మహాత్మా మన్నించు..
►తాగిన మైకంలో గాంధీ విగ్రహం ధ్వంసం
►పోలీసుల అదుపులో
►ఇద్దరు యువకులు
►నిందితులను శిక్షించాలని స్థానికుల ఆందోళన
►వారం రోజుల్లో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం : సర్పంచ్, ఉపసర్పంచ్
జవహర్నగర్ : తాగిన మైకంలో ఇద్దరు యువకులు జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో స్థాని కంగా ఉద్రిక్తలు చేసుకున్నాయి. ఈ సం ఘటన మండల కేంద్రంలోని అరుంధతినగర్లో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.అయితే శనివారంఉద యం ఈ సంఘటన ఆలస్యంగా గ్రామస్తులు గుర్తించి విగ్రహాన్ని ధ్వంసం చేసి న వారిని శిక్షించాలని ఆందోళనకు దిగడంతో కాలనీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక వార్డు సభ్యులు దాస్, ప్రసాద్గౌడ్, యువరాజుతో పాటు కాలనీ వాసులు బైఠాయించి ని రసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతి పిత మహా త్మాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయ డం దారుణమన్నారు.సమాచారం అం దుకున్న సీఐ నర్సింహరావు సిబ్బం దితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం ఆయన కాలనీలో విచారణ చేప ట్టారు. విగ్రహం సమీపంలో మద్యం బాటిళ్లు ఉండడంతో కాలనీకి చెందిన పలువురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరి లో పవన్, మహేష్ మద్యం మత్తులో తామే ఈ ఘటనకు పాల్పడ్డామని ఒప్పుకున్నారు. కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.
వారం రోజుల్లో విగ్రహం ఏర్పాటు
దుండగుల చేతిలో ధ్వంసమైన గాంధీ విగ్రహం స్థానంలో వారం రోజుల్లో కొత్త వాటిని ఏర్పాటు చేస్తామని సర్పంచ్ మల్లేష్, ఉపసర్పంచ్ రెడ్డిశెట్టి శ్రీనివాసులుతెలిపారు.