మహారాష్ట్ర వాసుల ఆందోళన
- సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
]కరీంనగర్ : కరీంనగర్ - మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తూ మహారాష్ట్ర వాసులు సోమవారం ఆందోళన చేశారు. మహారాష్ట్ర సిరోంచా తాలూకా పోచంపల్లి గోదావరి తీరంలోఈ ఆందోళన జరిగింది. ఈ సంధర్భంగా ఆందోళన కారులు ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మహారాష్ర్ట మాజీ మంత్రి, రాష్ట్రీయ కాంగ్రెస్వాది పార్టీకి చెందిన విజయ్ ఒడితివార్ మీడియాతో మాట్లాడుతూ ముంపు సమస్య తేల్చి బాధితులకు న్యాయం చేసే వరకూ పనులు చేపట్టకూడదని డిమాండ్ చేశారు.