పాలమూరు బంద్

పాలమూరు బంద్ - Sakshi


మహబూబ్‌నగర్: జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పై దాడిని నిరసిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మహబూబ్‌నగర్ జిల్లాలో బంద్ కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచే.. పార్టీ కార్యకర్తలు బస్సుల రాక పోకలను అడ్డుకుంటున్నారు. దీంతో పలు బస్‌డిపోల నుంచి బస్సులు బయటకు రాలేదు. జిల్లాలోని గద్వాల, అచ్చంపేట, షాద్‌నగర్, వనపర్తి, మహబూబ్‌నగర్ డిపోల ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు బైఠాయించారు. దీంతో జిల్లాలోని 9 డిపోలకు చెందిన 894 బస్సులు రోడ్డెక్కలేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top