పిచ్చికుక్కల దాడిలో 22 మందికి గాయాలు

పిచ్చికుక్కల దాడిలో 22 మందికి గాయాలు - Sakshi


నలుగురిని హైదరాబాద్‌కు తరలింపు



తాండూరు టౌన్‌: తాండూరులో ఆదివారం పిచ్చికుక్కలు బీభత్సం సృష్టించాయి. 22 మందిపై దాడి చేసి గాయపర్చాయి. స్థానికులు కుక్కలను తరిమేందుకు యత్నించగా వారినీ వదలలేదు. ఒక మహిళ వేసుకున్న స్వెట్టర్‌ను పట్టుకుని రోడ్డుపై లాక్కుంటూ కొద్దిదూరం వరకు తీసుకెళ్లాయి. గాయపడిన వారిని తాండూరు ఆస్పత్రిలో చేర్పించగా.. తీవ్రంగా గాయపడిన నలుగురిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.



విషయం తెలుసుకున్న మున్సిపల్‌ కమిషనర్‌ సంతోష్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధితులతో మాట్లాడారు. అయితే, తాండూరులోని వంతెన సమీపంలో కొందరు వేస్తున్న జంతు కళేబరాలను తిన్న కుక్కలు పిచ్చిగా ప్రవర్తిస్తున్నాయని, అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top