ప్రేమికుల ఆత్మహత్య
అశ్వాపురం (ఖమ్మం) : వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న భార్యను భర్త మందలించడంతో.. భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసి ఆమె ప్రియుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మొండికుంట గ్రామానికి చెందిన శెట్టిపల్లి అశ్విని(20)కి ఆరు నెలల కిందట వివాహమైంది. అయితే అంతకు ముందే ఆమె నర్సింహారావు అనే యువకుడిని ప్రేమించింది. కాగా పెళ్లి తరువాత కూడా నర్సింహులుతో సంబంధాలు కొనసాగిస్తోంది.
ఇది తెలిసిన భర్త పెద్దమనుషుల్లో పంచాయితీ పెట్టాడు. అయినా ఆమె తన తీరు మార్చుకోకుండా సంబంధాన్ని అలాగే కొనసాగిస్తుందని తెలుసుకున్న భర్త ఆమెను శుక్రవారం సాయంత్రం మందలించాడు. దీంతో మనస్తాపం చేందిన అశ్విని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసిన నర్సింహారావు కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరిద్దరిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం ఇద్దరూ మృతిచెందారు.