ఠాణాలో ప్రేమపెళ్లి
నారాయణఖేడ్: ఓ ప్రేమ జంట పోలీసుల సమక్షంలో ఒక్కటైంది. నారాయణఖేడ్ మండలం అంత్వార్కు చెందిన సుధాకర్(25), హైదరాబాద్లోని బషీర్బాగ్కు చెందిన శిరీష(23)లు ఉన్నత చదువులు చదివి హైదరాబాద్ లోయర్ ట్యాంక్బండ్లోని రామకృష్ణమఠంలో పనిచేస్తున్నారు. రెండేళ్లుగా వీరు ప్రేమించుకొంటున్నారు. పెళ్లికి వీరి కుటుంబ సభ్యులు ఒప్చకోకపోవడంతో నారాయణఖేడ్ పోలీసులను ఆశ్రయించారు. ఇరు కుటుంబాల వారిని, పెద్దలను పిలిపిం చిన పోలీసులు వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎట్టకేలకు అంగీకరించడంతో ఆదివారం రాత్రి పో?స స్టేషనఖలోనే ప్రేమజంటకు పెళ్లి జరిపించారు.