టాటాఏస్ను ఢీకొట్టిన లారీ.. 10 మందికి గాయాలు
తొర్రూరు: మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న టాటా ఏస్ వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో పదిమందికి గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించగా.. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్టె గ్రామ శివారులో మహిళా కూలీలతో వెళ్తున్న టాటా ఏస్ వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో 10 మంది కూలీలకు గాయాలయ్యాయి. వారిని వెంటనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా.. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.