విద్యార్థులను చిదిమేసిన లారీ
ఎడపల్లి: ఒకే గ్రామంలో ఇరుగుపొరుగు కుటుంబాలకు చెందిన ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడటంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వృద్ధాప్యంలో కుమారులు తమ కు అండగా ఉంటారని భావించారు. అ యితే అంతలోనే లారీ రూపంలో మృ త్యువు వారిని వెంటాడింది. ఎడపల్లి మండ లం నెహ్రూనగర్ గ్రామంలో లారీ ఢీకొని సయ్యద్ గౌస్ (13), ముజాయిద్ (14) అక్కడికక్కడే మృతి చెందారు. శుక్రవారం ఉదయం మదర్సాలో చదివేందుకు ఇళ్ల నుంచి బయలు దేరిన కొద్దిసేపటికేవారు చనిపోవడంతో పిల్లల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
లారీ చక్రాల కింద నలిగిపోయిన వారి మృతదేహాలు నుజ్జునుజ్జుయ్యాయి. తమ కు మారుడు సయ్యద్ గౌస్ను బాగా చదివించి ప్ర యోజకుడిని చేయాలని తల్లిదండ్రులు అహ్మ ద్, షహీన్బీ భావించారు. అందుకోసం రా త్రింబవళ్లు కష్టపడి సెట్రింగ్ పని చేస్తూ కొడుకును చదివించారు. అంతలోనే కుమారు డు అనంతలోకాలకు వెళ్లడంతో దంపతులను అపడం ఎవరితరం కాలేదు. అలాగే ఈ ప్రమాదంలో మరో విద్యార్థి ముజాయిద్ చనిపోవడంతో అతని తల్లిదండ్రులు షేక్ అహ్మద్, హసీనాబేగం తీవ్ర మనోవేదనకు గురయ్యా రు. కొడు కు మరణించడంతో దిక్కులు పెక్కటిల్లేలా రోదిస్తున్నారు. రోజూ కూలి పనిచేసి తమ కుమారుడిని చదివిస్తున్నామని, అంతలోనే తమను వదిలి వెళ్లిపోయాడని కన్నీరుమున్నారుగా విలపిస్తున్నారు. ఒకేసారి ఇద్దరు విద్యార్థుల మరణించడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.