జగదీశ్వరరెడ్డిపై ఆరోపణలపై లోకాయుక్త విచారణ

జగదీశ్వరరెడ్డిపై ఆరోపణలపై లోకాయుక్త విచారణ - Sakshi


హైదరాబాద్: మంత్రి జగదీశ్ రెడ్డిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై లోకాయుక్త సోమవారం విచారణ చేపట్టింది.  ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్  లోకాయుక్త ముందు విచారణకు హాజరయ్యారు. అయితే ఈ కేసులో ఉన్నతాధికారులు కోర్టుకు హాజరుకాలేదు.  ఈ కేసులో నివేదిక సమర్పించడానికి 4 వారాల గడువు కోరిన ఉన్నతాధికారుల విఙ్ణప్తిని లోకాయుక్త తిరస్కరించింది.  ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణకు హాజరుకావాల్సిందేనని లోకాయుక్త, జస్టిస్ సుభాషణ్ రెడ్డి  ఉన్నతాధికారులను ఆదేశించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top