డిప్యూటీ మేయర్ ఎందుకో ఇలా!!

కమిషనర్ తో డిప్యూటీ మేయర్ వాగ్వాదం


నిజామాబాద్ అర్బన్ : మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్  వివాదాస్పదమవుతన్నారు. కార్పొరేషన్ అధికారులకే అడ్డంకిగా మారుతున్నారు. గతంలో స్లాటర్‌హౌస్ సమీపంలో పారిశుద్ధ్య కార్మికులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, వారిని బెదిరించారనే ఆరోపణలు వచ్చారుు. దీంతో వారు పనులను నిలిపివేసి నిరసన కార్యక్రమాలు చేశారు. దీంతో దిగి వచ్చిన డిప్యూటీ మేయర్ కార్మికులకు క్షమాపణ చెప్పారు. శాంతించిన కార్మికులు విధుల్లో చేరారు. అ నంతరం స్లాటర్‌హౌస్‌కు సంబంధించి కాంట్రాక్టర్ నిబంధనలకు విరుద్దంగా పేడను విక్రయించారు.



సుమారు 50 నుండి 60 లారీల పేడను తీసుకెళ్లారు. దీంతో కార్పొరేషన్ అధికారులు స్థానిక పోలీసు స్టేష న్‌లో ఫిర్యాదు చేసి చర్యలు తీసుకున్నారు. దీనిపై డి ప్యూటీ మేయర్ కార్పొరేషన్ అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు. కాంట్రాక్టర్‌ను రక్షించినట్లు ఆరోపణ లు ఉన్నాయి. అహ్మద్‌పురకాలనీ స మీపంలో కార్పొరేషన్ అధికారులు అక్రమణల తొలగింపు కార్యక్ర మం చేపడితే అడ్డుకునే ప్రయత్నం చేశారు.



మున్సిపల్ కార్మికులకు అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. అధికారులపై సైతం మండిపడ్డారు. తాజాగా బస్టాండ్ వద్ద అక్రమణల తొలగింపు వ్యవహరంలో ఏకంగా డిప్యూటీ మేయర్ రోడ్డుపై బైఠాయించారు. మున్సిపల్ కమిషనర్‌పై మండిపడ్డారు. ఇలా డిప్యూటీ మేయర్ కార్పొరేషన్ అధికారులకు సైతం చుక్కలు చూపించడం ఆందోళన కలిగించిన విషయమే. కొందరు ఎంఐఎం కార్పొరేటర్లు మైనార్టీలకు  రుణాలను ఇప్పించడంలో భారీగా వసూళ్లు చేపట్టారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ సైతం వీరిని హైదరాబాద్‌కు పిలిపించి మండిపడినట్లు తెలిసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top