వ్యవసాయ బావిలో పడిన చిరుత


ఇల్లంతకుంట: కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం వెంకట్రావ్‌పల్లి గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో చిరుత పడింది. ఈ విషయాన్ని మంగళవారం ఉదయం గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుతను బయటకు తీసేందుకు వరంగల్ నుంచి రెస్క్యూ టీమ్ బయలు దేరింది. ఆహారం కోసం వచ్చి బావిలో పడి ఉంటుందని అటవీ శాఖాధికారులు భావిస్తున్నారు. వ్యవసాయ బావి చుట్టుపక్కల కోళ్ల ఫారాలు ఉన్నాయి. చనిపోయిన కోళ్లను బావిలో పడేస్తారు. వాటి కోసం వచ్చి ఉంటుందని సమాచారం. చిరుత వయస్సు ఏడాదిన్నర వయసు ఉంటుందని చెబుతున్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top