పెద్దగట్టు జాతరకు రూ. 2.10 కోట్లు విడుదల


సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా సూర్యాపేట నియోజకవర్గంలోని దూరజ్‌పల్లిలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించనున్న పెద్దగట్టు జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 2.10 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మంచినీటి వసతి, పారిశుద్ధ్యం, ఆలయ ముస్తాబు, రహదారులు, విద్యుదీకరణ ఇతర సదుపాయాల కల్పనకు ఈ నిధులను ఖర్చు చేస్తారు. దేవాదాయ, గ్రామీణ నీటిసరఫరా, పంచాయతీరాజ్, ట్రాన్స్‌కో అధికారులు సమన్వయంతో పని చేసి జాతరను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top