వరంగల్ రైల్వే స్టేషన్‌లో విస్తృత తనిఖీలు


వరంగల్ అర్బన్: వరంగల్ జిల్లా రైల్వే స్టేషన్‌లో గవర్నమెంట్ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) ఆదివారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. వరంగల్ జిల్లాలో వారం రోజుల కింద జిలెటిన్‌స్టిక్స్, మందుసామగ్రి దొరకడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటు మావోయిస్టులు, అటు ఉగ్రవాదుల నుంచి ఎటువంటి ముప్పు పొంచి ఉందోనని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఈ తనిఖీలు జీఆర్‌పీ ఎస్‌ఐ గోవర్ధన్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top