కూచన్పెల్లిలో అభివృద్ధి పనులకు భూమిపూజ
లక్ష్మణచాంద: మండలంలోని కూచన్పెల్లి గ్రామంలో అభివృద్ది పనులకు భూమిపూజచేసి పనులు ప్రారంభించినట్లు సర్పంచ్ లింగన్న పేర్కొన్నారు.గ్రామంలో ఉపాధిహామి పథకంలో 9లక్షల60వేల రూపాయలతో మంజూరి అయిన స్మాశాన వాటిక పనులను సర్పంచ్ లింగన్న గురువారం భూమిపూజ చేసి ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ది ప్రత్యేక పథకాలను రూపొందించిందని ఆయన పేర్కొన్నారు.
్ర రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో గ్రామాలు అభివృద్ధి పథంలోకి దూసుకుపోతున్నాయని ఆయన అన్నారు.గ్రామానికి మంజూరి అయిన 9లక్షల60వేల రూపాయలతో స్మాశాన వాటిక నిర్మాణం, మరుగుదొడ్లు నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సోన్ సర్పంచ్ కృష్ణప్రసాధ్రెడ్డి, ఉప సర్పంచ్ లింగన్న, నాయకులు రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.