వ్యక్తి ప్రాణం తీసిన భూ వివాదం


కరీంనగర్: భూ వివాదం కరీంనగర్ జిల్లాలో ఓ వ్యక్తి ప్రాణం తీసింది. జిల్లాలోని చిగురుమామిడి గ్రామంలో భూ వివాదం కారణంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరువర్గాలు పరస్పరం కర్రలతో దాడికి దిగారు.



ఈ ఘటనలో మహదేవ్ అనే వ్యక్తి మృతి చెందాడు. మరికొందరు గాయపడ్డారు. సమాచారం అందున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top