మహిళ ప్రాణం నిలబెట్టిన పోలీసులు
హైదరాబాద్: ముగ్గురు పిల్లలతో సహా ట్యాంక్బండ్ వద్ద ఓ మహిళ బుధవారం ఆత్మహత్యాయత్నం చేసింది. హుస్సేన్సాగర్లో దూకేందుకు ప్రయత్నించగా ఆమెను లేక్వ్యూ పోలీసులు అడ్డుకున్నారు. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావని ఆమెను ప్రశ్నించారు.
అత్తమామ వేధింపులే కారణమని ఆమె వెల్లడించింది. దీంతో ఆమె అత్తమామలను పోలీసులు పిలిపించారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. కోడలిపై వేధింపులకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.