ఇజ్రాయెల్‌లో తెలంగాణ వ్యక్తి ఆత్మహత్య

ఇజ్రాయెల్‌లో తెలంగాణ వ్యక్తి ఆత్మహత్య - Sakshi


ఆర్మూరు: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇజ్రాయెల్‌లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆర్మూరు మండలం మంథనికి చెందిన కుమ్మరి విఠల్(38) రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నట్టు అక్కడి తెలుగు అసోసియేషన్‌కు భారతీయ ఎంబసీ మంగళవారం సమాచారం ఇచ్చింది. అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానం వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్‌లోనే ఉండే ఆర్మూర్ ప్రాంతానికి చెందిన రవి అనే వ్యక్తి ‘సాక్షి’కి విషయాన్ని తెలియజేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top